లోకేష్పై వెనక్కి తగ్గిన బాబు, ఎన్టీఆర్ ఫ్యామిలీ మీట్

సంక్రాంతి పర్వదినం రోజు చంద్రగిరి శాసనసభా నియోజకవర్గంలోని నారావారి పల్లెలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఇష్టాగోష్టి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన జనవరి 13, 14 తేదీల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారి పల్లెలో ఉంటారు. బాలకృష్ణ, హరికృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సమయంలోని తన సోదరుడు రామ్మూర్తి నాయుడి కుమారుడు గిరీష్కు చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రి గల్లా అరుణ కుమారి కాంగ్రెసు నుంచి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీగా చంద్రబాబు నాయుడు గతంలో తన కుమారుడు నారా లోకేష్ను నియమించే ప్రయత్నాలు చేశారు. అయితే, నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. అయితే పూర్తిగానే నారా లోకేష్ను చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీగా నియమించే ఆలోచనను చంద్రబాబు విరమించుకున్నట్లు ప్రస్తుత పరిణామాన్ని బట్టి అర్థమవుతోంది. గిరీష్ తన తండ్రి వ్యాపార లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామంతో చంద్రబాబు కుటుంబ సభ్యుల సందర్శనకు గిరీష్ ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications