మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతిపై గ్యాంగ్‌రేప్, తల్లి గొంతు కోసిన కసాయి కొడుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal District
ఏలూరు/మెదక్: పశ్చిమ గోదావరి జిల్లాలోని టి.నర్సాపురంలో సోమవారం దారుణం జరిగింది. ఓ యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానికులు గమనించి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటన పోలీసు స్టేషన్ సమీపంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. వరంగల్ జిల్లా మద్దూరు మండలం కమలాయపల్లి గ్రామంలో ఓ కొడుకు తాగిన మైకంలో కన్నతల్లి గొంతు కోశాడు. గాయపడ్డ బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మెదక్ జిల్లాలోని జోగిపేటలో ఓ యువతి కిడ్నాప్‌కు గురైన సంఘటనలో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న యువతిని కొందరు గుర్తు తెలియని దుండగులు శనివారం కిడ్నాప్ చేశారు. ఆమెను సుమోలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
A son cutted his mother's throat in Warangal district. Local people take her to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X