తెలంగాణ ఇష్యూ, చంద్రబాబుపై బొత్స సెటైర్లు

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకుంటుందని, కాంగ్రెసు పార్టీయే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని, అందుకు సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. తెలంగాణపై సమైక్యమో, విభజనో కాంగ్రెసు పార్టీ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు, వైయస్ జగన్ రైతు యాత్రలు, దీక్షలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తమ పార్టీ త్వరలో ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి నియోజకవర్గాల సమీక్ష జరిపిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications