విజయ సాయి రెడ్డి 3 రోజులు పెదవి విప్పలేదు: సిబిఐ

CBI
హైదరాబాద్: తమ కస్టడీకి తీసుకుని మొదటి మూడు రోజులు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి పెదవి విప్పలేదని సిబిఐ చెప్పింది. విజయసాయి రెడ్డిని మరో వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విజయ సాయి రెడ్డి కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు ఆయనను మంగళవారం కోర్టు ముందు ప్రవేశపెట్టారు. తమ కస్టడీకి అప్పగించిన ఐదు రోజుల్లో విజయ సాయి రెడ్డి విచారణలో సహరించలేదని, చివరి రెండు రోజులు మాత్రమే కొన్ని వాస్తవాలు చెప్పారని, విజయ సాయి రెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి కీలక సూత్రధారి అని సిబిఐ అన్నది.

కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితుల వివరాలను విజయ సాయి రెడ్డి నుంచి తెలుసుకోవాల్సి ఉందని సిబిఐ వాదించింది. విజయ సాయి రెడ్డిని అరెస్టు తర్వాత కొంత మంది ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పారని తెలిపింది. విదేశీ ఆర్థిక లావాదేవీల వ్యవహారం కూడా విజయసాయి రెడ్డి నుంచి రాబట్టాల్సి ఉందని తెలిపింది. అనేక విషయాలపై విజయ సాయి రెడ్డిని విచారించాల్సి ఉందని చెప్పింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం లోగా వాదనలు ముగిశాయి.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి సిబిఐ కస్టడీని నాంపల్లి కోర్టు పొడిగించింది. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విజయసాయి రెడ్డిని సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనను ప్రతి రోజు ఉదయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారించాలని, ఐదు గంటల తర్వాత జైలుకు అప్పగించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయ సాయి రెడ్డిని కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+