పోరు చేస్తే అరెస్టు చేస్తారా: చంద్రబాబు మండిపాటు

Chandrababu Naidu
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై తాము పోరాటం చేస్తే అరెస్టు చేయడం సరైంది కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యుత్ సమస్యలపై తమ పోరాటం ఇంతటితో ఆగదని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. తన పాదయాత్రను అడ్డుకుని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇది చేతగాని, అసమర్థ ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. విద్యుత్ సమస్యనే ఇప్పుడు అతి ప్రధానమైన సమస్య అని ఆయన అన్నారు. సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం విద్యుత్ చార్జీలను మాత్రం ఇష్టానుసారంగా పెంచుతోందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో ప్రభుత్వమే లేని వాతావరణం ఉందని ఆయన అన్నారు. కరెంట్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై పడే 16 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి గ్యాస్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ఈ విషయం చెప్పారని ఆయన అన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషను నుంచి చంద్రబాబు విడుదలయ్యారు. రైతులకు ప్రభుత్వం హామీ మేరకు కరెంట్ సరఫరా చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+