హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ టూర్‌ను సక్సెస్ చేశారు: ఎర్రబెల్లి దయాకర్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు కుమ్మక్కయి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆర్మూర్ పర్యటనను విజయవంతం చేశాయని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. వైయస్ జగన్ తెలంగాణ ద్రోహి అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. జగన్ పార్లమెంటులో సమైక్యవాద ప్లకార్డులను ప్రదర్శించిన విషయం గుర్తు లేదా అని ఆయన అడిగారు. జగన్ ఆర్మూర్ రైతు దీక్షకు తెరాస, తెలంగాణ జెఎసి పరోక్షంగా సహకరించాయని ఆయన అన్నారు.

తెరాస, కాంగ్రెసు, తెలంగాణ జెఎసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని ఆయన అన్నారు. కావాలనే తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు హౌస్ అరెస్టయ్యారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్‌కు నిజామాబాద్ జిల్లాలో కేడర్ లేదని, తెరాస సహకారంతోనే ఆయన ఆర్మూర్ దీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లలో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఆయన అన్నారు.

English summary
TDP Telangana forum convener Errabelli Dayakar Rao said that TRS is co operating to YSR Congress president YS Jagan Armor tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X