వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు భద్రతపై కిరణ్ ప్రభుత్వం మీద విహెచ్ రుసరుస

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
సిద్దిపేట: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆర్మూర్ యాత్రకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారీ భద్రత కల్పించడంపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు రుసరుసలాడారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన, సోనియగాంధీ, రాహుల్‌గాంధీలను తిట్టిన వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా పర్యటకు భారీ బందోబస్తు కల్పించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఉదయం మెదక్ జిల్లా సిద్దిపేట శివారులో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కావడం వల్ల వరంగల్ జిల్లా పర్యటనకు బందోబస్తు కల్పించారంటే అర్థముందని, జగన్మోహన్‌రెడ్డి ఒక ఎంపీ మాత్రమేనని, జగన్ పర్యటించడానికి ఏ విధంగా సహకారమందించారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

జగన్‌ యాత్ర పట్ల ప్రభుత్వం, పోలీసు విభాగం అత్యుత్సాహం ప్రదర్శించాయని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రేపు ఉస్మానియ విశ్వవిద్యాలయం తెలంగాణ నాయకులు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో పర్యటిస్తామంటే ప్రభుత్వం ఇదే విధమైన బందోబస్తు కల్పిస్తుందా అని ఆయన అడిగారు. చంద్రబాబు రైతు పోరుబాటలో ఐదు నిమిషాలు కూడా రైతుల గురించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను తిట్టడానికే ఎక్కువ సమయం తీసుకున్నాడని చెప్పారు. రైతు పోరుబాట సందర్భంగా పోలీసులు, చంద్రదండు కలిసి తెలంగాణ ప్రజల పై దాడులు చేశారని విమర్శించారు.

English summary
Congress senior leader V Hanumanth Rao opposed CM Kiran kumar Reddy's stand on YSR Congress president YS Jagan Telangana tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X