కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లల గొంతు కోసిన తల్లి, కారు ప్రమాదంలో నలుగురు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadapa Map
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గురువారం ఉదయం విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లాలోని పొద్దుటూరు మండలం దేవాంగులలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన కూతురు, కొడుకు గొంతు కోసి తాను గొంతు కోసుకుంది. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి వద్ద ఓ కారు చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరు అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన వారుగా తెలుస్తోంది. మంచిర్యాల నుండి నర్సంపేట వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

తూర్పు గోదావరి రాజమండ్రి సమీపంలోని రాజానగరం దివాన్ చెరువు వద్ద లారీ-ట్యాంకర్ ఢీ కొన్నాయి. దీంతో ట్యాంకర్‌లోని ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు గన్నవరం సబ్ జైలు నుండి విశాఖపట్నం తరలిస్తున్న ఓ ఖైదీ నడుస్తున్న రైలు నుండి దూకి పారిపోయాడు. గన్నవరం సబ్ జైలు నుండి విజయవాడ మీదుగా కౌన్సెలింగ్ కోసం విశాఖ తరలిస్తుండగా ఖైదీ తప్పించుకున్నాడు.

English summary
Four dead at Dharmaram of Karimnagar in an accident on thursday. One accused absconded from police while travelling in train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X