నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై జగన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేరు: మేకపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
నిజామాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంతకంటే స్పష్టత ఇవ్వలేరని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ దీక్ష శిబిరం ప్రాంగణంలో అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తమ పార్టీ గౌరవిస్తుందని, రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని జగన్ స్పష్టంగా చెప్పారని అంతకుమించి స్పష్టత ఏముంటుందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా స్పష్టత ఇవ్వలేరన్నారు. కొందరు అడ్డుకున్నంత మాత్రాన దానిని పెద్దగా చేసి చూపించవద్దన్నారు. సీమాంధ్రలాగే తెలంగాణలోనూ జగన్‌కు ఆదరణ కనిపిస్తోందన్నారు. తెలంగాణలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభంజనం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భవిష్యత్తు లేదన్నారు.

దీక్షా శిబిరం వేదిక నుండి నేతలు మాట్లాడుతూ.. జగన్‌ను చంద్రబాబుతో పోల్చవద్దన్నారు. తెలంగాణపై చంద్రబాబుకంటే జగన్ స్పష్టత ఇచ్చారని చెప్పారు. టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రభుత్వ విప్ ధిక్కరించి పదిహేడు మంది ఎమ్మెల్యేలు కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. వారిపై ఇప్పటి వరకు వేటు వేయలేని చేతకాని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ కోసమంటూ కాంగ్రెసు నేతలు ఉత్తుత్తి రాజీనామాలు చేశారని విమర్శించారు.

English summary
MP Mekapati Rajamohan Reddy said that YSR Congress Party chief YS Jaganmohan Reddy clarified about Telangana already.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X