వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య ఆశీస్సులతోనే సిఎం అయ్యా: సదానంద

By Pratap
|
Google Oneindia TeluguNews

Sadananda Gowda
నెల్లూరు: తమ బిజెపి సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడి ఆశీస్సులతోనే తాను ముఖ్యమంత్రిని అయ్యానని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ అన్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధికి వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన అన్నారు. గ్రామీణులు, యువత, రైతులు మరింత అభివృద్ధి చెందాలనే ఆశయంతో వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమలు నిర్వహించడదం వల్ల పట్టణాలకు, గ్రామాలకు మధ్య అంతరం తగ్గిపోయి గ్రామీణాభివృద్ధి సులభమవుతుందని ఆయన అన్నారు.

పాశ్చాత్య వ్యామోహంలో పడి యువత భారతీయ సంస్కృతిని మర్చిపోతోందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతీసంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. వర్తమాన సమాజంలో బంధాలు, అనుబంధాలు తెగిపోయాయని, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారి, ఇందుకు పాశ్చాత్య పోకడలే కారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో జగపతి బాబు, సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు, నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

English summary
Karnataka CM Sadanada Gowda praised BJP senior leader M Venkaiah Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X