వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య: మరో మహిళా టెక్కీ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Techie Suicide
బెంగళూర్/ గుర్గావ్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకోగా, గుర్గావ్‌లో మరో మహిళా టెక్కీ హత్యకు గురైంది. ఓ ఐటి కంపెనీలో పనిచేస్తున్న పాతికేళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను అద్దెకు ఉంటున్న గదిలో ఉరేసుకుని మరణించింది. గదిలో పోలీసులకు స్యూసైడ్ నోట్ దొరికింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉంది. పూణేకు చెందిన నీలిమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే , కేరళకు చెందిన మరో మహిళా టెక్కీ గుర్గావ్‌లోని తన ఫ్లాట్‌లో దారుణ హత్యకు గురైంది. డిఎల్‌ఎఫ్ సిటీలోని గదిలో దుండగులు ఆమె గొంతు కోశారు. ఈ ఫ్లాట్‌లో ఆమె తన ముగ్గురు మహిళా సహచరులతో కలిసి ఉంటోంది. సిన్సి సెబాస్టియన్ అనే ఆ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రక్తం మడుగులో పడి ఉందని డిప్యూటీ పోలీసు కమిషనర్ (తూర్పు) మహేశ్వర్ దయాళ్ చెప్పారు. రూమ్మేట్స్ బయటకు వెళ్లిన తర్వాత ముగ్గురు, నలుగురు వ్యక్తులు లోనికి ప్రవేశించారని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. గదిలో విలువైన వస్తువులేవీ పోలేదు. దీంతో దొంగతనం కోసం ఈ హత్య జరగలేదని తెలుస్తోంది. హత్యకు కారణాలు తెలియడం లేదు.

English summary
A 25-year-old woman, working as an IT professional, allegedly committed suicide on Thursday by hanging herself in her rented room, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X