వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ సంక్షోభం: దుబాయ్‌కి అధ్యక్షుడు జర్దారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Asif Ali Zardari
పాకిస్తాన్: మెమొ కుంభకోణంపై పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అకస్మాత్తుగా ఒక రోజు పర్యటన నిమిత్తం దుబాయ్ బయలుదేరి వెళ్లారు. జర్దారీ పర్యటనపై టీవీ చానెళ్లు వార్తలను కుమ్మరించాయి. అయితే, తన దుబాయ్ పర్యటనలో రాజకీయం ఏమీ లేదని, ఆరోగ్య పరీక్షల కోసమే తాను దుబాయ్ వెళ్తున్నానని జర్దారీ చెప్పారు. దుబాయ్‌లోని తన ప్రైవేట్ నివాసంలో ఓ పెళ్లికి జర్దారీ హాజరవుతారని ఓ వార్తా సంస్థ తెలిపింది. పలువురు అధికారులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశాలున్నాయి.

మెమొ వివాదంతో ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తిన తర్వాత జర్దారీ దుబాయ్‌కి వెళ్లడం ఇది రెండో సారి. నిరుడు డిసెంబర్ 6వ తేదీన దుబాయ్ వెళ్లిన ఆయన పక్షం రోజుల పాటు అక్కడే ఉండి, హృదయ సంబంధమైన సమస్యకు చికిత్స తీసుకున్నారు. పదవి నుంచి దిగిపోవాలని జర్దారీపై సైన్యం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానివల్లనే ఆయన దుబాయ్ పర్యటన పెట్టుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాను పదవి నుంచి తప్పుకునే సమస్య లేదని జర్దారీ ఇప్పటికే స్పష్టం చేశారు.

నిరుడు మేలో అమెరికా ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన తర్వాత సైన్యం కుట్రను ఎదుర్కోవడానికి సహాయం చేయాలని అమెరికాను కోరిన మెమో గురించి పాకిస్తానీ అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్ ఇజాజ్ బహిరంగంగా చెప్పడంతో వివాదం ప్రారంభమైంది. అది ఓ కాగితం ముక్క మాత్రమేనని పాకిస్తాన్ ప్రభుత్వం కొట్టి పారేయడానికి ప్రయత్నించింది. ఈ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆర్మీ, ఐఎఎస్ఐ చీఫ్‌లు సుప్రీంకోర్టును కోరారు.

English summary
Pakistan President Asif Ali Zardari on Thursday departed on a one-day private visit to Dubai amidst a standoff between the civilian government and the powerful military on the memo scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X