హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియాకు దాసరి లేఖ, చిరంజీవిపై పరోక్ష విమర్శలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పని తీరు భేషుగ్గా ఉందని, కొందరు పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణ రావు శుక్రవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆయన తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను లక్ష్యంగా చేసుకొని లేఖ రాసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ బాగా పని చేస్తున్నారని, ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని దాసరి అందులో పేర్కొన్నారట. కొంతమంది పని కట్టుకొని పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారట. కిరణ్‌నే కొనసాగించాలని లేదంటే 1989 నాటి పరిస్థితులు పునరావృతమౌతాయని అందులో పేర్కొన్నారని వార్తలు వచ్చాయి. సోనియాతో పాటు కేంద్రమంత్రులు ప్రణబ్ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లకు కూడా లేఖలు రాసినట్లు వార్తలు వచ్చాయి.

కాగా తాను సోనియా గాంధీకి ఎలాంటి లేఖలు రాయలేదని దాసరి నారాయణ రావు ఓ టీవి ఛానల్‌తో చెప్పారని తెలుస్తోంది. తనకు లేఖలు రాసే అలవాటు లేదని చెప్పారు. తాను అధిష్టానానికి లేఖ రాసినట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాజనితమేనని కొట్టి పారేశారు. కాగా మరో రెండు నెలల్లో దాసరి రాజ్యసభ కాలపరిమితి పూర్తవుతుంది. ఆయన సీటే చిరంజీవికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన లేఖ రాసినట్టు వార్తలు రావడం పార్టీలో చర్చనీయాంశమైంది.

English summary
The roumers were came out that MP Dasari Narayana Rao wrote a letter to AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X