హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టపగలు సిటీలో మాజీ నక్సల్ పుష్ప దారుణ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పట్టపగలు మాజీ మహిళా నక్సలైట్ దారుణ హత్యకు గురైంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు, రెండున్నర గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు రామంతాపూర్‌లోని ఆమె ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి ఆమెను హత్య చేశారు. హతురాలిని మాజీ నక్సలైట్ పుష్పగా గుర్తించారు. సమీప బంధువులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం భర్త గణేష్ బాబుతో కలిసి ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఆ తర్వాత వారు రామంతపూర్‌లో ఉంటూ వస్తున్నారు.

అయితే గణేష్‌బాబు పుష్ప చెల్లెలిని వివాహం చేసుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పుష్ప, తన చెల్లెల్ని మోసం చేశాడని భావించి గణేష్ బాబును హత్య చేసిందని అంటారు. గణేష్ బాబు హత్య కేసులో ఆమె నిందితురాలు. పుష్ప గొంతు కోయడమే కాకుండా ఆమెను కత్తులతో కూడా పొడిచినట్లు తెలుస్తోంది. ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman naxalite Pushpa was ghastky murdered at Ramanthapur in Hyderabad in day light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X