చిరంజీవి ఢిల్లీకి వద్దు: కడప నాయకుల కొత్త కొలికి
రామచంద్రయ్యను కేబినెట్లోకి తీసుకుంటే కడప జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి పెచ్చరిల్లుతుందని చెప్పారు. ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇస్తే ఎమ్మెల్సీలుగా ఉన్న సీనియర్ నేతలు కూడా తమకూ అవకాశాలు కావాలని కోరుకుంటారని, వారంతా ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆజాద్కు వీరు చెప్పినట్లు తెలిసింది. అంతా ఒకే వర్గానికి చెందిన వారిని మంత్రి పదవుల్లో నియమిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని తెలిపారు. చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి, రామచంద్రయ్యను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవద్దని అభ్యర్థిస్తూ అందుకు కారణాలను వివరిస్తూ వారు ఆజాద్కు నోట్ సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా మంత్రి మాణిక్యవరప్రసాద్, పీసీసీ కార్యదర్శి వినోద్ రెడ్డి కూడా ఆజాద్ను కలుసుకుని రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడుతోందని, కిరణ్ పాలనలో పరిస్థితులు చక్కబడుతున్నాయని చెప్పారు.