జగన్ కంపెనీలకు సలహా, ల్యాప్టావ్ ఇవ్వండి: సాయి

సాయిరెడ్డి కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్రెడ్డి కోర్టులో ఈ పిటిషన్ వేశారు. కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేసే ముందు, న్యాయవాదులకు తగు సూచనలు ఇచ్చేందుకు కూడా కంప్యూటర్ అవసరమని విజయ సాయి రెడ్డి చెప్పారు. సాయిరెడ్డి ల్యాప్టాప్ ద్వారా ఇచ్చే సూచనలకు ఆయన తరఫు న్యాయవాదులు పొందేందుకు పెన్డ్రైవ్ను కూడా అనుమతించాలని కోరారు. మాటలను రికార్డు చేసి, అక్షర రూపంలోకి మార్చి, ప్రింట్ చేసుకునేందుకు అవసరమైన 'డిక్టాఫోన్' పరికరాన్నీ ఇప్పించాలని సాయిరెడ్డి కోరారు. జైలులో ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, డిక్టాఫోన్ వంటివి వాడుకునేందుకు అనుమతించాలని కోరిన నిందితుడు బహుశా సాయిరెడ్డి ఒక్కరే కావొచ్చని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. ఈ పిటిషన్పై విచారణను జడ్జి నాగమారుతీ శర్మ ఈనెల 20కి వాయిదా వేశారు. సాయిరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది.












Click it and Unblock the Notifications