మెడపట్టి గెంటేశారు, జగన్‌పై ఫైట్ నచ్చలేదు: శంకర్రావు

Shankar Rao
హైదరాబాద్: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై పోరాడుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను పిలిచి జగన్ వెంట ఎందుకు పడుతున్నావని ప్రశ్నించారని శంకర రావు గురువారం ఓ టీవి ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో అన్నారు. జగన్ అవినీతిపై పోరాడటం సిఎంకు ఇష్టం లేదన్నారు. తాను ఎలాంటి అవినీతిపరుడను కానని, పదవి లేకున్నప్పటికీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పారు. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండేందుకే తాను ప్రయత్నించానని చెప్పారు. తాను ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. సాధారణ పౌరుడిలా అవినీతిపై పోరాటం చేస్తానన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంటు కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తనను రాజీనామా చేయమని ఆదేశిస్తే చేసే వాడినని, తనకు ఎవ్వరూ అలా చెప్పలేదని, కానీ బర్తరఫ్ చేయడం అంటే మెడ పట్టి బయటకు గెంటి వేయడమేనని అందరి అభిప్రాయమన్నారు.

రాష్ట్ర నేతలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు ఎవరితో మిలాఖత్ అయ్యారో త్వరలో తేలుతుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా రెండు వందల రెట్ల ఉత్సాహంతో పోరాటం చేస్తానని చెప్పారు. తనను మంత్రివర్గం నుండి తొలగించడం సరైనదా కాదా ప్రజలనే అడగండన్నారు. తెలంగాణపై తాను పోరాటం చేస్తానని చెప్పారు. ఉప ఎన్నికలు కాంగ్రెసుకు రిఫరెండమా కాదా తాను చెప్పలేనన్నారు. ముఖ్యమంత్రి పాలనపై కూడా నో కామెంట్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+