కూల్చివేత: చంద్రబాబుపై మండిపడ్డ జగన్ పార్టీ నేతలు

Vasireddy Padma
హైదరాబాద్/విశాఖపట్నం/నెల్లూరు: తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా పెట్టిన విగ్రహాలు కూల్చి వేస్తామన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వేర్వేరుగా మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవడం బాబు జీర్ణించుకోలేక పోతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. అక్కసుతో వైయస్ విగ్రహాలను కూల్చుతామనడం సరికాదన్నారు. విగ్రహాల ఆవిష్కరణపై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రజలు స్వచ్చంధంగా వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. విగ్రహాల జోలికి వస్తే ఏం జరుగుతుందో బాబుకు బాగా తెలుసన్నారు. బాబు మాటలు ఆయన నీచ స్వభావానికి నిదర్శనమని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విశాఖపట్నంలో అన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు అడ్డుకోలేదన్నారు. జనాధఱ ఉన్న నేతలు కాబట్టే ప్రజలు ఎన్టీఆర్, వైయస్సార్ విగ్రహాలు పెట్టడానికి ముందుకొస్తున్నారన్నారు.

తెలంగాణలోనూ వైయస్సార్‌కు భారీగా అభిమానులున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు కింది స్థాయి నేతలు పట్టించుకోరని విమర్శించారు. జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కై కోట్లు గుమ్మరించినా తన గెలుపు ఎవరూ ఆపలేరన్నారు. 2014లో జరిగే ఎన్నికలకు ఇవి ఫ్రీ ఫైనల్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+