వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజల జోలికి వద్దు: సింహా డైలాగ్తో బాలకృష్ణ హల్చల్
మద్యం సిండికేట్లతో సామాన్యులు చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో లేనట్లుగా తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలు ఉన్నారన్నారు. పార్టీలో కార్యకర్తలు, అభిమానులకు సమ న్యాయం చేస్తామన్నారు. నాన్నగారి అభిమానులే కార్యకర్తలయ్యారని, తన అభిమానులు సైతం అలాగే కావాలన్నారు. టిడిపిని అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు. సమస్యలపై మన్యం వీరుడు అల్లూరిలా పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బాలయ్య సింహా సినిమాలోని ప్రజల జోలికి మాత్రం రావద్దూ అనే డైలాగ్తో అలరించారు. అందుకు అభిమానులు, కార్యకర్తలు అంతే ఉత్సాహంగా నినాదాలు చేశారు. అనంతరం మినుములూరులో బాలయ్య గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
Comments
English summary
Balakrishna created hulchul with Simha cinema dialogue in his Vishakapatnam tour.
Story first published: Sunday, January 22, 2012, 14:19 [IST]