అప్పటి కన్నా బెటర్: కిరణ్ సర్కారుపై బొత్స ప్రశంసలు

జగన్, చంద్రబాబు అబద్ధాలకు పేటెంట్లు పొందారన్నారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు రైతుయాత్ర పేరుతో అబద్ధాలు చెబుతున్నారని బొత్స విమర్శించారు. 2009 తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని జగన్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల వారికి కూడా సంక్షేమ పథకాలను చేర్చడానికి కృషి చేస్తున్నామని వివరించారు. వైఎస్ ప్రభుత్వం కన్నా ప్రస్తుత ప్రభుత్వమే సంక్షేమ పథకాలకు అధికంగా ఖర్చు పెడుతోందని బొత్స చెప్పారు. అవసరమైతే జగన్ వచ్చి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఆరు కిలోల బియ్యం, తొమ్మిది గంటల కరెంటు మినహా మిగతా పథకాలన్నీ వందశాతం అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిగురించి మాట్లాడకుండా పిల్లలకు ఫీజులివ్వలేదని, రైతులను పట్టించుకోలేదని బురద జల్లడం మానుకోవాలని బాబు, జగన్కు సత్తిబాబు హితవు పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు.












Click it and Unblock the Notifications