వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి కోసం మేం మాకోసం వారు పని చేయాలి!: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: జెఏసి కోసం మేం పని చేస్తున్నప్పుడు జెఏసి కూడా మా కోసం పని చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం సూచించినట్లుగా తెలుస్తోంది. ఎంతసేపూ జెఏసి ఉద్యమం చేస్తుంటే టిఆర్ఎస్ రాజకీయంగా లబ్ధి పొందుతోందని అనటం సరికాదని, అసలు ఈ ఆలోచనే తప్పు అని, జెఏసి ఉద్యమం చేస్తుంటే కాంగ్రెసు, టిడిపి లాభపడాలా అని కెసిఆర్ ప్రశ్నించారని సమాచారం. తెలంగాణ జెఏసి విస్తృత స్థాయి సమావేశం శనివారం కొనసాగింది. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భాగస్వామ్య పక్షాల ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. మనం సొంతంగా 70-80 అసెంబ్లీ స్థానాలను గెలిస్తేనే, తెలంగాణ వ్యతిరేక పార్టీలు భయపడతాయని, జెఏసి కార్యాచరణకు, ఉద్యమానికి మేం రాజకీయ సహకారం అందిస్తున్నప్పుడు, మాకూ జెఏసీ సహకరించాలని, తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ఇక్కడ చోటు లేకుండా చేయాలన్నట్లుగా తెలుస్తోంది. 2014 ఎన్నికలు లక్ష్యంగా జెఏసిలోని పక్షాలను రాజకీయంగా బలోపేతం చేసే విధంగా జెఏసి కార్యాచరణ ఉండాలని కెసిఆర్ సూచించారు.

ఉద్యమ పంథా విజయవంతానికి రాజకీయ అస్తిత్వం తప్పనిసరి అని, జెఏసిలో ఉండటమంటే రాజకీయంగా నష్టపోవటం కాదని, రాజకీయంగా నష్టపోయే పనికైతే జెఏసిలో ఉండటం ఎందుకని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కో ఖతంకరో తెలంగాణకో హాసిల్‌కరో అన్న నినాదంలో తెలుగుదేశం పార్టీని కూడా చేర్చాలని అభిప్రాయపడినట్లుగా సమాచారం. తెలంగాణలో టిడిపి యాత్రలకు కాంగ్రెస్ సహకరించిందని, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు యాత్ర సక్సెస్ అయ్యేలా చెసిందని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు ఒక్కటైనప్పుడు మనమంతా కూడా ఒక్కటి కాకపోతే అణగదొక్కేస్తారన్నారు.

English summary

 TRS chief K Chandrasekhar Rao suggested JAC that to work for Telanga parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X