వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డికు స్పీకర్ నోటీసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Sobha Nagi Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదిన ఉదయం 11.30 గంటలకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా స్పీకర్ శోభా నాగి రెడ్డికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. విప్ జారీ చేసిన పిఆర్పీ ఎమ్మెల్యే వంగా గీతను కూడా అదే రోజు హాజరు కావాలని నోటీసు పంపారు. అదే విధంగా ఫిబ్రవరి 2వ తేదిన స్పీకరు ఎదుట హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి అసెంబ్లీ కార్యరదర్శి రాజా సదారాం నోటీసులు జారీ చేశారు. గతంలో స్పీకరు జారీ చేసిన నోటీసులు తనకు అందనేలేదని ఎమ్మెల్యే కాపు స్పీకరుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. అదే రోజు ప్రభుత్వ విప్ కొండ్రు మురళి స్పీకరు ముందు హాజరై తాము రామచంద్రారెడ్డికి విప్ జారీ చేసినట్లుగా ఆధారాలు చూపనున్నట్లు సమాచారం.

కాగా ఈ నెల 18 నుండి 21వ తారీఖు వరకు జగన్ వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట రెండోసారి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలు భేటీ స్పీకర్ ముందు భేటీ కావొద్దని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తాము గతంలోనే స్పీకర్ ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చామని మళ్లీ హాజరు కావాల్సిన అవసరం లేదని పిల్లి సుభాష్ చంద్ర బోస్, శోభా నాగి రెడ్డి అప్పుడు మీడియాతో చెప్పారు.

English summary
Speaker Nadendla Manohar served notices to PRP MLA Sobha Nagi Reddy on satureday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X