తెలంగాణపై తేల్చండి: ఆజాద్తో టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

పలువురు ఎమ్మెల్సీలు కూడా తమకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆజాద్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రాంతాలకతీతంగా కేబినెట్లోకి తమను తీసుకోవాలని కోరారు. మంత్రివర్గంలోకి తీసుకునే విషయమై చర్చిస్తామని, అయితే ఎమ్మెల్సీల సేవలు మాత్రం వినియోగించుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాగా అంతకుముందు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీలో ఎమ్మెల్సీలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గం సహా అన్నింటా తమ ప్రధాన్యం పెంచాలని తాము ఆజాద్ను కోరతామని చెప్పారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడం వల్ల కార్యకర్తల్లో తీవ్ర నిరాశ ఉందన్నారు.












Click it and Unblock the Notifications