విజయ సాయి రెడ్డికి చుక్కెదురు, ల్యాప్‌టాప్‌నకు నో

Vijaya Sai Reddy
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి కోర్టులు చుక్కెదురైంది. ల్యాప్‌టాప్‌ను వాడుకోవడానికి అనుమతించాలనే విజయ సాయి రెడ్డి విజ్ఞప్తిని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు సోమవారం తిరస్కరించింది. తాను జగన్ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలకు ఆర్థిక సలహాదారుగా ఉన్నందున సలహాలు ఇవ్వడానికి తనకు ల్యాప్‌టాప్ ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయ సాయి రెడ్డికి ల్యాప్‌టాప్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశం, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని సిబిఐ కోర్టు ముందు వాదించింది. టైప్ రైటర్‌ను విజయ సాయి రెడ్డి వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలిపింది. దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో విజయ సాయి రెడ్డికి ల్యాప్‌టాప్ ఇవ్వడం సరి కాదని సిబిఐ వాదించింది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై కోర్టులో సోమవారం వాదనలు పూర్తయ్యాయి. తన నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ తనకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. కోనేరు ప్రసాద్ వైద్యపరమైన రికార్డులు పాతవని సిబిఐ వాదించింది. కోనేరు ప్రసాద్‌కు హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ల్)లో చికిత్స చేయిస్తే సరిపోతుందని అభిప్రాయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+