Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రేమ విఫలమైందనే మనస్థాపంతో ప్రేమికుడి ఆత్మహత్య

Chittoor Map
చిత్తూరు: ప్రేమ విఫలమైందనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ప్రకాశ్ అనే యువకుడు చిత్తూరులో ఓ విద్యుత్ స్తంభానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వస్తే తిరుపతిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ప్రకాశ్ అనే యువకుడు చందన అనే యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 19వ తేదిన హైదరాబాద్ వచ్చి అక్కడి పోలీసులను ఆశ్రయించారు. ఐతే పోలీసులు వారిద్దర్ని ఎంఆర్ పల్లి పోలీస్టేషన్‌కు పంపించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రేమికులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

కౌన్సెలింగ్ తర్వాత యువతి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిపోయింది. దాంతో మనస్థాపం చెందిన ప్రకాశ్ తన మృతికి పోలీసులే కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కాగా నడిరోడ్డు పైన యువకుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+