హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్సీకి హైకోర్టు షాక్: రెండు ఓట్లతో ఓటమి

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నర్సా రెడ్డికి రాష్ట్ర హైకోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రతినిధుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై తెలుగుదేశం అభ్యర్థి నర్సారెడ్డి గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నర్సారెడ్డి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే, వెంకట్రామి రెడ్డి ఆ ఎన్నికపై కోర్టుకు ఎక్కారు. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అయితే, కేసును హైకోర్టులోనే పరిష్కరించాలని, అవసరమైతే హైకోర్టు సమక్షంలో ఓట్ల లెక్కింపును తిరిగి చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో కేసుపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి.

చివరకు హైకోర్టు సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తిరిగి జరిగింది. ఈ రీకౌంటింగ్‌లో నర్సా రెడ్డి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయిట్లు తేలింది. ఇది నర్సారెడ్డికి వ్యక్తిగతంగానే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా ఎదురు దెబ్బనే. కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్సిగా ఎన్నికైనట్లు హైకోర్టు ప్రకటించింది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే తమ బలాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి నర్సారెడ్డి ఓటమి ఆశనిపాతమేనని చెప్పాలి.

English summary
High Court has announced that TDP MLC Narsa Reddy has been defeated by Congress candidate Venkatrami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X