ధ్వంసంపై ధర్నా: జగన్ పార్టీ నేత జూపూడి, గద్దర్ అరెస్ట్

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వెంకట స్వామి(కాకా) ఈ ఘటనపై మండిపడ్డారు. తాను అంబేడ్కర్ ఉన్నప్పుడు ఆయన వెంట నడిచే వాడినన్నారు. ఇప్పుడు ఆయన విగ్రహాల ధ్వంసం చూస్తుంటే తనకు దుఖం వస్తుందన్నారు. విధ్వంసంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెసు తీరు ఓ సామాజిక వర్గాన్ని దూరం చేసుకునే విధంగా ఉందన్నారు. అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి దళిత వ్యతిరేకిగా తయారయ్యారన్నారు. సమన్వయ కమిటీలో దళితులకు చోటు లేక పోవడం సరికాదన్నారు. మంత్రి శంకర రావును తొలగించడం దళిత వ్యతిరేక విధానంలో భాగమేనన్నారు.












Click it and Unblock the Notifications