వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లక్ష్మినారాయణపై దుమ్మెత్తిపోసిన జగన్ పార్టీ నేతలు
లక్ష్మినారాయణ నిజాయితీపరుడు కారని వారు అభిప్రాయపడ్డారు. కాంగ్రెసుకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా లక్ష్మినారాయణ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. నిజమైన దోషులను లక్ష్మినారాయణ పట్టించుకోవడం లేదని, అమాయకులను వేధిస్తున్నాడని వారన్నారు. జగన్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తే రాష్ట్ర ప్రజలు లక్ష్మీనారాయణను క్షమించబోరని వారు హెచ్చరించారు. సిబిఐ వైయస్ జగన్ కుటుంబాన్ని వేధిస్తోందని వారు ఆరోపించారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో మొదటి దోషి చంద్రబాబేనని వారన్నారు. చంద్రబాబును వదిలేసి వైయస్ జగన్ కుటుంబ సభ్యులను సిబిఐ వేధిస్తోందని వారన్నారు. సిబిఐ చంద్రబాబు బ్యూరో ఇన్వెస్టిగేషన్గా మారిపోయిందని వారు వ్యాఖ్యానించారు.
Comments
English summary
YSR Congress leaders Bajireddy Govardhan and Gattu Ramachandar Rao lashed out at CBI JD Lakshmi Narayana.
Story first published: Tuesday, January 24, 2012, 16:14 [IST]