నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్య, చిరు పోరు: దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన ఫ్యాన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Balakrishna
నెల్లూరు: హీరో నందమూరి బాలకృష్ణ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి దిష్టిబొమ్మల పోటాపోటీ దగ్ధం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసింది. చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన అభిమానులు నెల్లూరులోని శ్రీ వివేకానంద సెంటర్‌లో బాలకృష్ణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని చిరంజీవి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిని మరొకరు తోసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు బాలయ్య అభిమానులు, అటు చిరంజీవి అభిమానులు పోటా పోటీగా నినాదాలు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. పరిస్థితులు అదుపులో ఉంచేందుకు అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. సుమారు రెండు వందల మంది అభిమానులు ఇరువైపులా అక్కడకు వచ్చారు. కాగా ఇటీవల చిరంజీవి, బాలకృష్ణల మధ్య వాగ్యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. బాలయ్య కామెంట్ చేయడం, అందుకు చిరంజీవి స్పందించడం తెలిసిందే.

English summary
Fans burnt Chiranjeevi and Balakrishna effigies in Nellore district today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X