తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు, బాలయ్య పోరు: తిరుపతిలో ఇరు పక్షాల ఘర్షణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna-Chiranjeevi
తిరుపతి: కాంగ్రెసు శాసనసభ్యుడు మెగాస్టార్ చిరంజీవికి, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణకు మధ్య మాటల యుద్ధం ఇరు పక్షాలకు మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య తిరుపతిలో ఘర్షణ ప్రారంభమై, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద బాలయ్య అబిమానులు, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పక్షాలు పరస్పరం దాడులకు దిగాయి.

ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఇరు వర్గాలు రెండు వైపులా మోహరించి ఉన్నాయి. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపించారు. చిరంజీవి, బాలకృష్ణ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ మాటల యుద్ధం ఇరువురు హీరోల అభిమానుల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది.

English summary
Chiranjeevi and Balakrishna fans clashed at Tirupati and police lathicharged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X