తెలంగాణ పేరుతో కెసిఆర్, జగన్ మోసం: దేవేందర్

Devender Goud
హైదరాబాద్: తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మంగళవారం ప్రసంగించారు. తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నించారని, వైయస్ జగన్ కల నెరవేరదని ఆయన అన్నారు. ప్రజలను ఓదారుస్తున్న జగన్‌ను ఓదార్చేవారు ఎవరూ లేకుండా పోయారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు.

తన పార్టీ తెలంగాణకు అనుకూలమేనని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదిస్తే తాము ఆమోదింపజేసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి జీవగడ్డగా మారిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు ఆరేళ్లు గడిచినా మోక్షం లేదని ఆయన అన్నారు. అక్రమాల్లో కూరుకుపోయిన కాంగ్రెసు పార్టీని బొంద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెసు పార్టీకి రాష్ట్రాన్ని పాలించే ఆర్హత లేదని ఆయన అన్నారు. భ్రష్టు పట్టిన కాంగ్రెసు పార్టీకి చరమగీతం పాడాలని ఆయన కోరారు. అందుకు పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన చైతన్యయాత్రలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభ్యుడు పి. మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+