వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబులాగే కాంగ్రెస్‌కు జగన్ మోసం: సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మదనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేరని, ఆ విషయం ఆయనకు కూడా అర్థమైందన్నారు. అందుకే ఆయనలో అభద్రతా భావం నెలకొందన్నారు. ఆయన మాట్లాడే భాష మనుషులు మాట్లాడేలా లేదని, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు. ఆయనకు ఓ డిక్షనరీ ఇస్తే బాగుంటుందన్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. బాబు అధికారంలో ఉంటే వెంకన్నను కూడా తాకట్టు పెట్టేవారని ఆరోపించారు. కాంగ్రెసును మోసం చేసిన వారిలో చంద్రబాబు తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేరిపోయారన్నారు. కాంగ్రెసును మోసం చేసి సొంత పార్టీ పెట్టుకొని భూస్థాపితం చేస్తానని హెచ్చరించడం సరికాదన్నారు.

కాంగ్రెసు పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. మహిళా, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏటా వడ్డీలేని రుణానికి రూ.1500 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతోందన్నారు. చిరంజీవి, బొత్స సత్యనారాయణ, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. చిరంజీవి ఎప్పుడూ తన వర్గానికి మంత్రి పదవులు కావాలని, శాఖలు కావాలని పట్టుబట్టలేదన్నారు. ప్రభుత్వంలో చేరినందుకు తమకు న్యాయం చేయాలని మాత్రమే అడిగారన్నారు.

English summary
YSR Congress party chief YS Jaganmohan Reddy followed TDP chief Nara Chandrababu Naidu, accused CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X