ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదు: జగన్

గుంటూరు పాత అంబాపురంలో స్థానిక రైస్మిల్ సెంటర్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. తనపై ఆదరణ చూపుతున్న ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆదరణ ఏమాత్రం తగ్గదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తనను, తన కుటుంబాన్ని వేరు చేయాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications