వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునీల్ రెడ్డి నాకెలా బంధువు అవుతారు?: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డి తనకు ఎలా బంధవు అవుతాడో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అడిగారు. ఆ విషయం సిబిఐవాళ్లే చెప్పాలని ఆయన అన్నారు. తనను ఇబ్బందులు పెట్టడానికి, వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లడానికి సిబిఐ అమాయకులను కూడా పావులుగా వాడుకుంటోందని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లాలో తన ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్నారు. గురజాల ముస్లిం సెంటర్‌లో ఆయన ప్రసంగించారు. పులివెందులకు చెదంినవాళ్లు రెడ్డి అయితే చాలు, ఏదో ఒక విధంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడున నారా చంద్రబాబు నాయుడిని కాపాడుతూ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని బాధ్యుడ్ని చేసే ఉద్దేశంతో కాంగ్రెసు, తెలుగుదేశం, సిబిఐ కుట్రలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తోందని ఆయన అన్నారు. సునీల్ రెడ్డి అరెస్టు వార్త విన్నప్పటి నుంచి వైయస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నీచ రాజకీయాలకు పాల్పడే బదులు తనను కాల్చేయవచ్చు కదా అని ఆయన మంగళవారం రాత్రి వ్యాఖ్యానించారు. సిబిఐపై కూడా ఆయన తన దాడిని పెంచారు.

English summary
YSR Congress president YS Jagan questioned that how he is related to Sunil Reddy, arrested by CBI in EMAAR properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X