Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎదుగు ఓర్వలేకే: బాలయ్యపై చిరంజీవి పరోక్ష వ్యాఖ్యలు

Chiranjeevi
హైదరాబాద్: తన ఎదుగుదలను, అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి గురువారం హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. 63వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన అభివృద్ధి ఓర్వలేకే తనపై విమర్శలు అన్నారు. తనపై చేసిన విమర్శలకు అందరికీ త్వరలో సమాధానం చెబుతానని అన్నారు. స్వాతంత్రం సాధించిన త్యాగమూర్తుల లక్ష్య సాధనకు పునరంకితమవుతామన్నారు. తాను ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాతే అందరూ సామాజిక న్యాయం అంటున్నారని, అంతకుముందు పూలే గురించి మాట్లాడిన వారు లేరన్నారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు, తదితరులు హాజరయ్యారు. కాగా అంతకుముందు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జెండాను ఆవిష్కరించిన బాలకృష్ణ, చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని చెప్పారు. గత పదిహేను ఇరవై రోజులుగా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం నడిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+