ఎసిబి అదుపులో జగన్ వర్గం నేత ప్రసన్న అనుచరుడు

ఇటీవల మొదటిసారి దాడులు జరిగినప్పుడే వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ ఎసిబి పూర్తి సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల ద్వారా మద్యం మాఫియాలో కొత్త కోణం బయటపడింది. ఎక్సైజ్ శాఖ అధికారులు కొన్ని చోట్ల మద్యం వ్యాపారులకు కోట్లాది రూపాయలు వడ్డీలకు ఇస్తున్నారు. మద్యం పూర్తిగా అమ్మిన తర్వాత వారు వ్యాపారుల నుండి వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో మూడు కేసులు నమోదయ్యాయి. తక్కువ కాలంలోనే మళ్లీ దాడులు చేయడంతో సిండికేట్లలో దడ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో ఒకరి ఇంట్లో అధికారులు పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ దాడుల వ్యవహారం తనకు తెలియదని, ఇప్పుడు తెలుసుకున్నానని, తప్పు చేసిన వారిపై తప్పకుండా చర్యలుంటాయని మంత్రి మోపిదేవి వెంకట రమణ చెప్పారు.












Click it and Unblock the Notifications