హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విజయమ్మను టార్గెట్ చేసిన టిడిపి నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్/గుంటూరు/తిరుపతి: సిబిఐ దర్యాప్తును తప్పు పడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు ఒక్కుమ్మడిగా ఆమెను టార్గెట్ చేశారు. ఇల్లు కుదువపెట్టిన మనకు ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని ఆనాడే విజయమ్మ భర్త వైయస్ రాజశేఖర రెడ్డిని, కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అడగాల్సి ఉందని, అలా అడిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వారన్నారు. తెలుగుదేశం నాయకులు టి. దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం, కాంగ్రెసు కలిసి కక్ష సాధిస్తున్నారని వైయస్ విజయమ్మ అనడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీలాంటివే అని ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి తమపై వైయస్ విజయమ్మ అలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. కేవలం రాజకీయ సానుభూతిని పొందేందుకే వైయస్ విజయమ్మ ప్రధానికి లేఖ రాశారని వారు అభిప్రాయపడ్డారు. అవినీతి సొమ్ము వస్తున్నప్పుడు భర్తను, కుమారుడిని వైయస్ విజయమ్మ అడగాల్సి ఉండిందని వారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని, ఆయన పాపాలే ఆయనను చంపుతాయని తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివ ప్రసాద్ మంగళవారం గుంటూరులో మంగళవారం అన్నారు. జగన్ ఇప్పటికైనా అప్రూవర్‌గా మారితే మంచిదన్నారు. లేకుంటే ఎమ్మార్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డియే గుట్టు అంతా విప్పుతారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సిబిఐ దర్యాఫ్తును తప్పు పడుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయడం బాధాకరమని మరో టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తిరుపతిలో అన్నారు.

ఎంపి జగన్ అరెస్టులో విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని మంత్రులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మార్‌కు భూముల కేటాయింపులో వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కారని ఆరోపించారు. వైయస్ విజయమ్మ లేఖ సరికాదని మరో నేత దేవేందర్ గౌడ్ వేరుగా హైదరాబాదులో అన్నారు.

English summary
Telugudesam leader have targeted YSR Congress MLA YS Vijayalaxmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X