చిరు మోజు పడ్డారని ఇచ్చేస్తున్నారు: దేవినేని ఉమ
రూ.వందల కోట్ల విలువైన ఈ ద్వీపాన్ని కేవలం రూ.60 కోట్లకు ఈ కంపెనీకి క ట్టబెడుతున్నారని, ప్రస్తుతం 33 ఏళ్లకు లీజుకు ఇచ్చి తర్వాత దాని ని మరో ఇరవై ఏళ్లకు పొడిగించే అవకాశం కూడా కల్పించారని ఆయన అన్నారు. ప్రస్తుతం రూ.వంద టిక్కెట్టుతో సామాన్యులు కూడా ఇందులోకి వెళ్లి సేదదీరే అవకాశం ఉందని, బడా బాబులు రంగంలోకి దిగితే ఆ టిక్కెట్టు ధరను ఆకాశానికి తీసుకెళ్లి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
ఈ కేటాయింపుపై గతంలో విమర్శలు చెలరేగినప్పుడు ఎవరికీ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం లీక్ ఇచ్చిందని, కాని ఇటీవలి పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో ఈ ద్వీపానికి కూడా ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నట్లు చూపారని, దొడ్డిదారిన దీన్ని ఖరారు చేసే వ్యవహారం నడుస్తోందని అన్నారు. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఈ ద్వీపం చూశారని, తమ సినిమా షూటింగులకు ఇది చా లా బాగుంటుందని అల్లు అరవింద్ అన్నారని ఉమామహేశ్వర రావు చెప్పారు. అధికారులు తొందరపడి ఈ వ్యవహారాన్ని ఆమోదిస్తే శ్రీలక్ష్మి, ఆచార్య మాదిరిగా జైల్లో కూర్చోవలసి వస్తుందని హెచ్చరించారు.