వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రమతికి జీవం పోసిన రంగస్థల నటి సావిత్రి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nellore Map
నెల్లూరు: నాలుగు దశాబ్దాల పాటు రంగస్థలంపై పలు పాత్రలకు జీవం పోసిన ప్రముఖ నటి సావిత్రి కన్నుమూశారు. ఇతిహాస, పౌరాణిక పాత్రలెన్నింటికో జీవం పోసిన నటీమణి జీవన రంగస్థలం నుంచి తప్పుకున్నారు. సత్యహరిశ్చంద్ర నాటకంలో 'చంద్రమతి' పాత్రకు ఆమె పెట్టింది పేరు. 66 ఏళ్ల గూడూరు సావిత్రి గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సావిత్రి, నెల్లూరు పట్టణంలోని కుమారుడి ఇంట సోమవారం కన్నుమూశారు. స్త్రీలు బయటకు రావడమే తప్పుగా భావించే కాలంలో సావిత్రి ధైర్యంగా పద్య నాటకరంగంలో అడుగుపెట్టారు.

సురభి కళాకారిణిగా మొదలై డీవీ సుబ్బారావు, పొన్నాల రామసుబ్బారెడ్డి వంటి రంగస్థల హేమాహేమీలతో నటించి మెప్పించారు. పద్య ఉచ్చారణ, పాత్ర పోషణ, సంగీతానికి తగిన స్వరగమనంతో మూడు దశాబ్దాల పాటు తెలుగు పద్య నాటకాన్ని రక్తి కట్టించారు. సత్యహరిశ్చంద్ర అంటే డీవీ సుబ్బారావు అన్నట్టే, చంద్రమతి వేషం గూడూరు సావిత్రే వేయాలనేవారు. తన జీవితకాలంలో 13 వేల ప్రదర్శనలు ఇవ్వగా, అందులో చంద్రమతి పాత్రనే ఎక్కువగా పోషించారు. 2011 సంవత్సరానికి గాను హంస అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ఇప్పటిదాకా మూడు నాటక నందులు అందుకున్నారు. తొలి దశలో కొన్ని సినిమాల్లోనూ సావిత్రి నటించారు.

English summary
Stage artist Savithri passed away with ill health at Nellore town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X