జగన్ తొలి సంతకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత కామెంట్

కాగా సమాచారం కమిషనర్లను అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై నియమించుకున్నాయని జూపూడి ఆరోపించారు. కమిషనర్ల నియామాకాలలో పారదర్శకత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచార హక్కు కమిషన్ పైన ఉన్న ప్రేమ దళిత, గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ పైన లేదని అంతకుముందు రోజు విమర్శించారు. హైకోర్టులో ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ కారణంగా ముఖ్యమంత్రి కిరణ్ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ సమావేశమై సమాచార హక్కు చట్టం కమిషనర్లను నియమించిందన్నారు. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడులకు ఎస్సీ, ఎస్టీ, కార్పోరేషన్లకు పాలక వర్గాలను నియమించాలన్న విషయం గుర్తుకు రాకపోవడం విచారకరమన్నారు.












Click it and Unblock the Notifications