చిన జీయర్ స్వామి తిరుమల పాదయాత్రకు బ్రేక్

చిన జీయర్ స్వామి వరాహ స్వామిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారికి మాత్రమే సహస్ర దీపాలంకరణ చేయాలని చినజీయర్ స్వామి అంటున్నారు. తిరుపతిలో ఆయన అంతకు ముందు మాట్లాడారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని ఆయన అన్నారు. టిటిడి వ్యవస్థ సక్రమమార్గంలో నడిచేలా చూడాలన్నారు. తిరుమల గురించి తెలిసిన వారే టిటిడి సభ్యులుగా ఉండాలని, ఆలయ పాలనలో లాజిక్కులు ప్రమాదకరమని హెచ్చరించారు. చరిత్ర తెలియని వారు చరిత్ర గురించి మాట్లాడటం బుద్ధి లేని పని అన్నారు. లోపాలను ఎత్తి చూపడం మా లక్ష్యం కాదన్నారు. వెయ్యికాళ్ల మండపం కూల్చి వేసిన అధికారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications