హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిని తెలంగాణలోకి అనుమతించవద్దు: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణుపై స్పష్టమైన వైఖరి చెప్పని పార్టీలకు చెందిన నాయకులను తెలంగాణలో తిరగనివ్వవద్దని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పే వరకు తిరగనివ్వవద్దని ఆయన అన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైకరిని చెప్పని పార్టీలతో కలిసి ఉద్యమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొందరు స్వార్థపరుల కబంధహస్తాల్లో చిక్కుకున్నందు వల్లనే తెలంగాణపై నిర్ణయం తీసుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. హైదారాబాదులోని బాగ్ లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైల్వే ఉద్యోగుల డైరీని ఆయన శనివారం ఆవిష్కరించారు.

ప్రచారం, నిర్మాణం, ఆందోళనలే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ తర్వాత ప్రారంభమయ్యే ఉద్యమ ఉధృతి గురించి హైదరాబాదులో పెద్ద యెత్తున చాటి చెప్పాలని ఆయన అన్నారు. సికింద్రాబాద్ జెఎసి నాయకులు లాలాపేటలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం పోరుయాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

English summary
Telangana political JAC chairman Kodandaram called upon Telanganites not to allow anti Telangana parties into Telangana region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X