అసెంబ్లీలో దొంగలుపడ్డారు:ప్రత్యర్థులపై దాసరి సినిమాస్త్రం

ఆయన తాజాగా తలపెట్టిన చిత్రం 2014 ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు. ఇందులో ఆర్టిస్టులు ఎవరో ఇంకా ఖరారు కాలేదు. సొంతపార్టీలోని ప్రత్యర్థులను టార్గెట్ చేయడం ద్వారా దాసరి సంచలనానికి తెరదీయబోతున్నారని అంటున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో దాసరి తన ఉదయం పత్రిక ద్వారా ఆయనను టార్గెట్ చేశారు. అయితే అప్పుడు కాంగ్రెసులో ఉండటంతో టిడిపి, ఆ తర్వాత మేస్త్రీ ద్వారా చిరంజీవిని టార్గెట్ చేశారు. మారిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసుకోవడం విశేషం.












Click it and Unblock the Notifications