ముచ్చటగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణం
మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెసు నేత చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రఘవీరా రెడ్డి, వట్టి వసంత కుమార్, ఏరాసు ప్రతాప రెడ్డి, గల్లా అరుణ కుమారి, గీతా రెడ్డి తదితర మంత్రులు, శాసనసభ్యులు కూడా వచ్చారు.
సైన్యంలో కెప్టెన్గా ఎంత క్రమశిక్షణగా పనిచేశానో మంత్రిగా అంతే క్రమశిక్షణతో పనిచేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటన్నారు. తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వలేదని అంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పుడు ఇస్తే ఎందుకు విమర్శిస్తోందని ఆయన అడిగారు. ఏ శాఖ అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని ఆయన అన్నారు. తనకు మంత్రివర్గంలోకి చోటు కల్పించినందుకు కొండ్రు మురళి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా ప్రమాణం చేయడానికి ముందుకు విప్ పదవికి కొండ్రు మురళి రాజీనామా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వైద్య విద్యను, ప్రసాద్ కుమార్కు చేనేత జౌళి శాఖను, కొండ్రు మురళికి ఆర్డబ్ల్యుఎస్ శాఖను కేటాయించారు.
కొత్తగా ముగ్గురు చేరడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కోస్తాంధ్రకు చెందినవారు 17 మందికి ప్రాతినిధ్యం లభించింది. కొండ్రు మురళి చేరికతో ఈ సంఖ్య 16 నుంచి 17కు పెరిగింది. తెలంగాణకు కూడా అంతే ప్రాతినిధ్యం ఏర్పడింది. ఇంతకు ముందు 13 మంది మంత్రులు ఉండగా, ఆ సంఖ్య ఇద్దరి చేరికతో 15కు పెరిగింది. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రితో కలిపి 9 మంది ఉన్నారు.