హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను కోటీశ్వరుడిని చేసేందుకే: వైయస్‌పై యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: తన కొడుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోటీశ్వరున్ని చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు సోమవారం ఆరోపించారు. అవినీతికి పాల్పడిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్, ఆయన కేబినెట్ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. అనర్హత వేటు విషయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు పలుకుతున్న శాసనసభ్యులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఐఏఎస్‌లు ఇచ్చే సమాచారంతో మంత్రులను జైళ్లకు పంపించవచ్చునని ఆయన అన్నారు. ఐఏఎస్‌లు, మంత్రుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు, రాష్ట్రం తీవ్రంగా నష్ట పోతోందన్నారు. మంత్రుల అవినీతిపై అధికారులు నోరు విప్పాలన్నారు.

వైయస్ హయంలో అవినీతి జరిగిందనడానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. తెర వెనుక జరిగే లాలూచితో తమకు ఎలాంటి సంబంధం లేదన్న బొత్స తెర ముందు జరిగే వాటికి బాధ్యత వహించారా అని ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బొత్స నిరూపించుకోవాలని సవాల్ చేశారు. జైలులో ఉన్న నేరస్తులకు ప్రత్యేక వసతులు కల్పించడంపై తాను కోర్టును ఆశ్రయిస్తానని టిడిపి శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

English summary
TDP senior leader Yanamala Ramakrishnudu blamed late YS Rajasekhar Reddy for corruption at the time of his ruling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X