Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామోజీ ఈనాడు డైలీ రాతలకు జగన్ సాక్షి కౌంటర్

Sakshi Logo
హైదరాబాద్: రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు వార్తాకథనాలను తప్పు పడుతూ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి డైలీ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. పచ్చ కామెర్ల చూపు అనే శీర్షిక పెట్టి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈనాడు రాతలపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారని భాష్యం చెప్పింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై, ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తప్పా అని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వాన్‌పిక్ భూసేకరణ ప్రక్రియను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. వేలాది మందికి ఉపాధి కల్పించే వాన్‌పిక్ భూసేకరణకు ఈనాడు దినపత్రిక దురుద్దేశాలు అంటగట్టిందని మండిపడింది.

ఉపాధితో నిమిత్తం లేని ఎమ్మార్ గోల్ఫ్‌కోర్స్‌కు చంద్రబాబు 535 ఎకరాల భూమి ఇవ్వడం తప్పు కాదా అని ప్రశ్నించింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎంజీ అనే నకిలీ సంస్థకు చంద్రబాబు 850 ఎకరాల భూమిని ధారపోస్తే ఎందుకు ప్రశ్నించలేదని ఈనాడును అడిగింది. ఎల్ అండ్ టీకి హైటెక్ సిటీ ఇచ్చినందుకే టిడిపి ఆఫీసును ఉచితంగా కట్టి ఇవ్వడం క్విడ్ ప్రో కో కాదా అని అడిగింది. సిబిఐ మీద కూడా సాక్షి దినపత్రిక విరుచుకపడింది. సిబిఐ ఎల్లో మీడియాను అనుసరిస్తోందా, ఎల్లో మీడియా రాతలకు సిబిఐ సహకరిస్తోందా అంటూ ప్రశ్నించింది. ఎల్లో మీడియా దురుద్దేశపూర్వకంగా కథనాలను ప్రచురిస్తోందని, వాటి ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆడిపోసుకుంది. చంద్రబాబు ఏయే సంస్థలకు ఎంతెంత భూమిని కేటాయించిందో కూడా సాక్షి దినపత్రిక క్రోడీకరించింది. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో వివిధ సంస్థలకు 17,434 ఎకరాల భూమిని కట్టబెట్టారని సాక్షి దినపత్రిక తేల్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+