వైయస్ జగన్ను విమర్శించేవారిపైనే సిఎం వేటు: టిడిపి
మద్యం సిండికేట్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, లేదంటే ముఖ్యమంత్రికి కూడా వాటా ఉందని భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో వాస్తవాలు బయటపడుతాయని, పెద్ద చేపలు బయటుపడతాయని చెప్పి చిన్న చేప మోపిదేవి వెంకటరమణ పేరు ఇరికిరంచారా అని ఆయన అడిగారు. మోపిదేవి వెంకటరమణ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణలు నిర్ధారణ అయిన మోపిదేవి వెంకటరమణతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరపడం సరి కాదని ఆయన అన్నారు. మోపిదేవి వెంకటరమణతో జరిపిన చర్చల సారాంశాన్ని బయటపెట్టాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి ఎసిబి దాడులను కిరణ్ కుమార్ రెడ్డి వాడుకుంటున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి పదవి పోటీ పడుతున్నారని చెప్పి ఎసిబి దాడులను బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా వాడుతున్నారని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణను ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఎసిబి దాడులు జరిగిన తర్వాతనే 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పచారని, అంతకు ముందు కాంగ్రెసులో ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హులేనని అన్నారని ఆయన అన్నారు. తమ శాసనసభయ్డు వెంకటవీరయ్యకు మద్యం సిండికేట్లకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మోపిదేవి వెంకటరమణ అడ్డంగా దొరికిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. దొరికిపోయిన తర్వాత మోపిదేవి వెంకట రమణ బుకాయిస్తున్నారని ఆయన అన్నారు.