బిపి ఆచార్యకు కోర్టులో చుక్కెదురు, బెయిల్ నిరాకరణ

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తొలి ముద్దాయి బిపి ఆచార్య అని, దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో బిపి ఆచార్యకు బెయిల్ ఇవ్వడం సరి కాదని సిబిఐ వాదించింది. విల్లాల విక్రయాలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలన్నీ ఆచార్యకు తెలుసునని, ఓ నివేదికను కూడా ఆచార్య తొక్కి పెట్టారని సిబిఐ తెలిపింది. బిపి ఆచార్య బయటకు వస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదిస్తూ బిపి ఆచార్యకు బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ కోర్టును కోరింది.












Click it and Unblock the Notifications