ఎన్టీఆర్ ఘాట్ నుంచి అసెంబ్లీకి బాబు పాదయాత్ర

మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎసిబి తన రిమాండ్ రిపోర్టులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేరు చేర్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రంలోని దౌర్భాగ్య పరిస్థితికి కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన విమర్సించారు. ప్రభుత్వ చర్యలను శాసనసభ ఎండగడుతామని ఆయన అన్నారు. తమకు చెప్పకుండా భూకేటాయింపులపై విచారణకు వేసిన సభా సంఘంలో తమ పార్టీ సభ్యులను వేయడం సరి కాదని ఆయన అన్నారు. పైగా బిక్షమెత్తినట్లు ఇద్దరు సభ్యులను మాత్రమే సభా సంఘంలో వేశారని ఆయన అన్నారు.