హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ చానెల్ న్యూస్ రీడర్ ఆత్మహత్య, ఒత్తిడి వల్లే

By Pratap
|
Google Oneindia TeluguNews

Charminar
హైదరాబాద్: ఓ ప్రైవేట్ టీవీ చానెల్ న్యూస్ రీడర్ శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సవ్యసాచి పట్నాయక్ అనే 27 ఏళ్ల న్యూస్ రీడర్ హైదరాబాదులోని వనస్థలిపురంలో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడిని తట్టుకోలేకనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పది నెలల క్రితం అతన టీవీ చానెల్‌లో చేరి తన సహోద్యోగి జీను కుమార్‌తో కలిసి వనస్థలిపురంలోని ద్వారకామయి నగర్‌లో ఉంటున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం - శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చాడు. రూమ్మేట్ జీను కుమార్ డిన్నర్‌కు వెళ్లి రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. అతను వచ్చి చూసే సరికి సవ్యసాచి పట్నాయక్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అయితే అప్పటికే అతను మరణించాడు.

సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అది ఒరియాలో రాసి ఉంది. పట్నాయక్ తండ్రి ఇటీవల మరణించాడు. దీంతో కుటుంబ భారం అతనిపై పడింది. తమ్ముడు, చెల్లె ఉన్నారు. అతను ఒరిస్సాలోని గంజాం జిల్లాలోని సిద్ధేశ్వర్‌కు చెందినవాడు. పోస్టు మార్టం తర్వాత అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A news reader working in a private TV channel committed suicide by hanging himself on Saturday night allegedly due to work pressure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X